ఈ మేరకు శాస్త్రీయ అభివృద్ధి, మానవీయ, విద్యార్థుల సంక్షేమానికి ప్రచారం కల్పించేందుకు ఎవరైతే కృషి చేస్తారో వారికే ఇచ్చేందుకు 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు' ఏర్పాటుచేయాలని ఆదేశించినట్టు సీఎం జయలలిత వెల్లడించారు.
ఇక కలాం పుట్టినరోజు అక్టోబర్ 15న ప్రభుత్వం తరపున 'యూత్ రెనైసాన్స్ డే'గా పాటించనున్నామన్నారు. అలాగే ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవం నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందజేస్తామని జయలలిత చెప్పుకొచ్చారు. ఈ అవార్డు కింద 8 గ్రాముల పసిడి పతకం, రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం ఇస్తారని, ఈ ఏడాది నుంచి అవార్డు ఇవ్వనున్నామని జయ పేర్కొన్నారు.