తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా ఓ యువతి పాడిన పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ యువతి బృందానికి అనేక మంది నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు. 'ప్రజాస్వామ్యం మరణించింది... నా ఓటు నీకు కాదు' అంటూ ఈ పాట సాగుతుంది.
ఈ పాట ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణంపై తమిళనాడు సెంటిమెంట్ను ప్రతిబింభించేలా ఉంది. తమ ప్రదర్శనను ఓ పోలీసు అధికారి ఆపడానికి ప్రయత్నించారని, తన వస్త్రధారణ సరిగా ఉన్నా మందలించాడని ఫేస్బుక్లో సోఫియా పోస్ట్ చేశారు. సోఫియా గతంలో కొడైకెనాల్లో కాలుష్యం గురించి ఓ పాటను రూపొందించి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.