ఈ విద్యార్థికి, టీచరమ్మకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు క్లాసు ముగిశాక ఏకాంతంగా ప్రేమ పాఠాలు బోధించుకునేవారు. ఈ క్రమంలో సెలవు దినాల్లో కూడా పాఠశాల ఉందని చెపుతూ విహారయాత్రలకు వెళ్లేవారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిద్దరిని మందలించారు.
దీంతో వారిద్దరు పారిపోవాలని నిర్ణయించుకుని సోమవారం రాత్రి పారిపోయారు. దీనిపై టీచరమ్మ తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతులమ్మ.. విద్యార్థితో లేచిపోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.