బాధిత ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళుతున్న సమయంలో కాపుకాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి బంగారు చైన్, ఐదు వేల రూపాయిల నగదు దోచుకున్నారు. అనంతరం పొదలచాటుకు బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.