జర్నలిస్టు రాజ్దేవ్ రాజన్ హత్య కేసు నిందితుడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలపై.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. తాజాగా ఈ కేసులో బీహార్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజన్ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా శివాన్ ఎస్పీని ఆదేశించింది.