ప్రజలకు క్షమాపణలు చెప్పిన హీరో విజయ్.. ఎందుకంటే?

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (19:03 IST)
తమిళనాడులో స్థానిక సంస్థాగత ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అలాగే ఓటు వేసేందుకు గాను హీరో విజయ్ రాక నేపథ్యంలో ఆయనను తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు పోటెత్తారు. ఆ పోలింగ్ బూత్ అంతా మీడియా ప్రతినిధులతో నిండిపోయింది. 
 
అదే సమయంలో అక్కడ ఓటేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల పరిస్థితిని గమనించిన హీరో విజయ్ వెంటనే వారికి క్షమాపణలు తెలియజేశారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు