కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూసేకరణ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకునేందుకు రాజ్యసభను ప్రోరోగ్ చేయాలని కేబినెట్ కమిటీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సీసీపీఏ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు పాల్గొన్నారు.
రెండో దశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు జరుగనున్న నేపథ్యంలో, ఏదో ఒక సభను ప్రోరోగ్ చేస్తే తప్ప ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కేంద్రానికి లేని నేపథ్యంలో రాజ్యసభను ప్రోరోగ్ చేసినట్టు తెలిపారు.