టీవీ సీరియల్ నటి, మోడల్ డీ జయశీలి (49) దారుణ హత్యకు గురైంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం టీవీ నటిని హత్యచేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆదివారం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఆమె శవమై ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సాలిగ్రామం పెరియార్ వీధిలో ఉన్న ఆమె ఫ్లాట్ నుంచి చెడువాసన రావడంతో పొరుగు వారు పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే 50 సవర్ల బంగారం మాయమైందని ఆమె సోదరుడు సెల్వరాజ్ తెలిపారు. మరోవైపు ఆమె ఒంటిమీద ఉన్న నకిలీ బంగారు ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే.. జయశీలిపై లైంగికదాడి అనంతరం దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టుగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇమిటేషన్ గోల్డ్ని దుండగుడు టచ్ చేయకపోవడంతో పాటు, గదిలో పెర్ ఫ్యూం చల్లడం, సంఘటనా స్థలంలో కండోమ్ లభ్యం కావడం అనేక అనుమానాలకు తావిస్తోందని పోలీసు అధికారులు తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ మొదలుపెట్టారు.