రెండు వారల క్రితం ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి బస్సు ఎక్కారు. అదే బస్సులో ఉన్న నిందితుల్లో ఒకరు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు. తొలుత హోషంగాబాద్ తీసుకెళ్ళి ఒక ఇంట్లో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, రేవా పట్టణాల్లో తిప్పారు. పదిహేను రోజులపాటు 20 మంది నరకం చూపారు.
ఒక ఇంట్లో ఉంచి బయట తలుపుకు తాళం వేయడం మరచి వారు బయటకు వెళ్లగా, ఇద్దరు అమ్మాయిలూ తప్పించుకు వచ్చి ఇల్లు చేరి, బంధువుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, వారిని ఉంచినట్టు అనుమానిస్తున్న అన్ని ప్రాంతాలకూ పోలీసు బృందాలను పంపినట్టు శికార్వర్ తెలిపారు.