విద్వేషాలు రెచ్చగొట్టైనా సరే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని శివసేన భావిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర సదన్లో చోటుచేసుకున్న ఘటనను కూడా మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేసింది. రంజాన్ ఉపవాసం భగ్నం చేసేందుకు ప్రయత్నించిన చిల్లర నాయకులను హీరోలంటూ ఉద్ధవ్ థాకరే సమర్థించారు. తాజాగా పార్టీకి చెందిన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టేలా సంచలన వ్యాఖ్యలు ప్రచురించారు.