ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడగింపు

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (08:22 IST)
ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువును మరోమారు పొడగించారు. ఈ నెల 14వ తేదీతో ఈ ఉచిత అప్‌డేట్ గడువు ముగియనుంది. దీంతో ఈ గడువును మరో మూడు నెలలు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా పొడగింపుతో కలుపుకుంటే ఈ ఉచిత అప్‌డేట్ గడువు డిసెంబరు 14వ తేదీ వరకు ఉంది. 
 
అప్పటిలోపు ఆధార్ కార్డులో ఉన్న తప్పొప్పులతో పాటు.. ఫోటో, చిరునామా, చేతి వేలిముద్రలు తదితర వివరాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆధార్ కార్డులో తమ డాక్యుమెంట్స్‌ అప్ డేట్ చేసుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, ఈ గడువును ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. 


శివలింగాన్ని చోరీ చేసిన యువకుడు.. ఎక్కడ?  
 
తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ తనకు ఇంకా పెళ్లి కాలేదన్న అక్కసుతో ఓ యువకుడు ఏకంగా శివలింగాన్నే చోరీ చేశాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంభి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కౌశంభి జిల్లాకు చెందిన చోటూ అనే యువకుడు ప్రతి  రోజూ స్థానికంగా ఉండే భైరవ బాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసేవాడు. తనకు పెళ్లి చేసుకునే భాగ్యం కల్పించాలని తన ఇష్టదైవాన్ని ప్రార్థించేవాడు. అందుకు సరైన అమ్మాయి లభించాలని దేవుడిని ప్రతి రోజూ ప్రార్థించేవాడు.  అలా కనీసం నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశాడు. 
 
అయితే, అతను ఎన్ని పూజలు చేసినప్పటికీ అమ్మాయి లభించలేదు. చివరకు అసహనానికి గురైన చోటూ గత నెల 31వ తేదీన స్థానిక ఆలయంలో ఉండే శివలింగాన్ని అపహరించాడు. ఆలయంలో ఉన్నట్టుండి శివలింగం కనిపించకపోవడంతో స్థానిక భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
వారు ఆలయం వద్దకు వచ్చి అనేక మంది భక్తులను విచారించారు. అయితే, చోటూ అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి  తీసుకున్న పోలీసులు.. విచారించగా, అసలు విషయాన్ని వెల్లడించారు. 
 
తాను ఎన్నో పూజలు చేసినప్పటికీ, అమ్మాయి దొరక్కపోవడంతోనే విసుగు చెంది శివలింగాన్ని అపహరించినట్లు తెలిపాడు చోటూ. ఆలయానికి సమీపంలో చెట్ల పొదల్లో దాచిపెట్టిన శివలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు