తన ప్రియురాలితో పాటు అనేక మంది యువతులతో తనకున్న వావాహేతర, అక్రమ సంబంధాల గురించి కుటుంబ సభ్యుల ముందు బహిర్గతం చేసిన తన భార్యను ఓ భర్త 14 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కాదు. ఉత్తరప్రదేశ్కు చెందిన బిస్కట్ కింగ్ ఓం ప్రకాష్ దాసాని తనయుడు. ఈ హత్య కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయి.
ఇందుకు సంబంధించి పియూష్ దాసాని మొబైల్ ఫోన్ కాల్ లిస్టును బహిర్గతం చేశారు. గత రెండు నెలల కాలంలో మనీషా మఖీజాకు 663 సార్లు ఫోన్ చేయగా, తమ కంపెనీలో పని చేసే మరో యువతికి 330 సార్లు ఫోన్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు.
ఈ విషయాలన్నీ తెలుసుకున్న భార్య జ్యోతి దాసాని వాటిని అడ్డుకోవడమే కాకుండా, తన భర్త రాసలీలలను కుటుంబ సభ్యుల ముందు బట్టబయలు చేసింది. ఈ కోపంతో భార్యను ప్రియురాలి డ్రైవర్, అతడి స్నేహితుడి సాయంతో కసిదీరా 14 సార్లు పొడిచి చంపినట్టు తేలింది. ఈ కేసుపై విచారణ సాగుతోంది.