కాగా యూపీలో కొంత కాలంగా కసబ్ (కాంగ్రెస్+ఎస్పి+బిఎస్పి) పాలన కొనసాగుతోందని, దీంతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తింగా కుంటుపడిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా యూపీలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ సమాజ్వాది, కాంగ్రెస్, అఖిలేశ్, మాయావతిలను ‘స్కామ్’ (ఎస్సిఎఎం)గా అభివర్ణించారు. బిఎస్పి అంటే ‘బెహన్జీ సంపత్తి పార్టీ’గా అని ఆయన పేర్కొన్నారు.