ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆలయ ప్రవేశం చేయబోయిన ఓ దళిత వృద్ధుడిని సజీవ దహనం చేసిన దారుణం మరచిపోకముందే.. ఓ తండ్రి తన నాలుగేళ్ళ కుమార్తెను కర్కశంగా కొట్టిచంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ చిన్నారి చేసిన నేరం ఏంటో తెలుసా..? ఆమె ముఖానికి ధరించిన దపట్టా భోజనం చేసే సమయంలో కిందికి జారిపోవడమే.
బరేలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాఫర్ హుస్సేన్ అనే వ్యక్తికి ఫర్హీన్ అనే నాలుగేళ్ళ కుమార్తె ఉంది. ఈ చిన్నారి అన్నం తింటున్న సమయంలో ముఖానికి ఉన్న ముసుగు (దుపట్టా) జారిపోయింది. ఇది ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకమని, ఘోర తప్పిదమని భావించిన జాఫర్, కోపంతో తన కూతురిని దారుణంగా కొట్టి, పాప తలను నేలకేసి బాదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.