ఇదే అంశంపై మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 2005, జులై 16న అతనిని (జడ్జి) పొడిగించేందుకు కొల్లెజియం కూడా పరిగణించినట్లు ఓ నోట్ చెబుతోందన్నారు. అందువల్ల ఖట్జూ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఉభయసభల్లోనూ డీఎంకే సభ్యులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు.