భారతీయ రైల్వేలో డ్రైవర్లు, గార్డులుగా పని చేసే వారు ఓవర్ టైమ్ డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి వల్ల ఇదేవిధంగా కొనసాగితే అనేక ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితికి ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఓ సంఘటనే మచ్చుతునక. వరుసగా ఓవర్టైమ్ డ్యూటీలు చేసి అలసిపోయిన ఓ గూడ్సు రైలు డ్రైవరు చివరకు ఒకరోజు తాను నడపాల్సిన గూడ్సు రైలును స్టేషన్లో 17 గంటలపాటు నిలిపేశాడు.