విద్యుత్ ఆదాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పద్దతులను ప్రవేశపెడుతోందనీ, అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాల్లోగా ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని నారాయణ విహార్ లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ, రెండో దశలో భాగంగా మెట్రో సిటీలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.