మేధావులు తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. నిరంతరం మారే ప్రభుత్వాలు ప్రామాణికం కాదు. దేశం మాత్రం హేతుబద్ధంగా ఉండాలి. బహుళత్వం ప్రాతిపదికగా సాగాలి. వెనుకబడిన, దిగువ తరగతి, నిర్లక్ష్యానికి గురైన ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని రాజ్యాంగం చెబుతుందని గుర్తు చేశారు.
మీరు చెప్పే ప్రతి విషయాన్ని ప్రపంచం వింటోంది. అలాగే, ప్రపంచం చెప్పేదాన్ని కూడా మీరు చెప్పాలని కోరారు. అంతేకాకుండా తప్పు చేసినవాడు, తప్పును చూస్తూ ఉండిపోయిన వాడు ఇద్దరూ సమానమేనని ఠాగూర్ చెప్పారని ఎంపీ సలీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.