ఉరిశిక్షపై తీర్పు ఇచ్చాక పెన్నుపాళీని ఎందుకు విరిచేస్తారు?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:38 IST)
భారతీయ శిక్షాస్మృతిలో ఉరి అనేది అత్యంత పెద్ద శిక్ష. ఇటువంటి శిక్ష విధించిన తర్వాత జడ్జి తన పెన్ను పాళీ(నిబ్)ని విరిచేస్తారు. ఈ దృశ్యం చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. ఇలాచేయడం వెనుక రాజ్యాంగంతో ముడిపడిన ఒక కారణం ఉందట. 
 
ఒకసారి నిర్ణయం లిఖించిన తర్వాత జడ్జికి సైతం ఈ నిర్ణయాన్ని మార్చేందుకు అధికారం ఉండదు. దీనికితోడు జడ్జి చేతుల మీదుగా ఒక జీవితానికి ముగింపు పలికిన పెన్ను... మరోమారు వినియోగించేందుకు ఉపకరించదట. అందుకే ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పు రాసిన పెన్ను పాళీని జడ్జి విరిచేస్తారట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు