సూరత్‌లో మహిళను బలిగొన్న స్వైన్ ఫ్లూ: ఈ సీజన్లో తొలి కేసు

సోమవారం, 31 ఆగస్టు 2015 (14:47 IST)
సూరత్‌లో ఓ మహిళను స్వైన్ ఫ్లూ బలిగొంది. శీతాకాలం ప్రవేశించకుండానే ఈ సీజన్‌లో ఇది తొలి కేసు కావడం గమనార్హం. సూరత్‌లో హెచ్1ఎన్1 వైరస్ సోకి వరచ్చా ప్రాంతానికి చెందిన 78 సంవత్సరాల మహిళ మరణించింది.

మరో 58 సంవత్సరాల వ్యక్తికి, 28 ఏళ్ల యువతికి వైరస్ సోకినట్టు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. మరో 11 మందిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించాయని తెలిపారు. 
 
ఈ సీజన్‍‌లో స్వైన్ ఫ్లూ సందర్భంగా మరణించిన తొలి కేసు ఇదేనని వివరించారు. ఈ మహమ్మారికితోడు ఆగస్టు నెలలో 83 మందికి డెంగ్యూ, 1,079 మందికి మలేరియా సోకిందని అధికారులై తెలియజేశారు. స్వైన్ ఫ్లూ మరింతగా విస్తరించకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించినట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి