గువాహటికి సమీపంలోని సోనిత్పూర్ జిల్లాలోని బార్ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి (50) అనే మహిళ కుటుంబానికి, అదేప్రాంతానికి చెందిన మరో కుటుంబానికి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఫాగుని కుటుంబం తమ కోళ్లను దొంగిలించి విందుచేసుకుంటోందని మరో కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారు. ఫాగుని కుటుంబసభ్యులు తమని తాము రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.