పట్టపగలు.. చుట్టు కొన్ని వేల మంది జనం.. అయినా ఆ కామాంధులకు అవేమి పట్టలేదు. దొరికిన యువతిని కారులోనే ఊరంతా తిప్పుతూ తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఇద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ పక్కనే ఓ అబల అత్యాచారానికి గురవుతున్నా సమాజం గమనించలేని స్థితి ఏర్పడింది. దాదాపుగా నాలుగు గంటల పాటు ఆమె శరీరంతో ఆడుకున్నారు. ఉత్తరప్రదేశ్ మీరట్ నగరంలో శనివారం జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
40 ఏళ్ల యువతి మందులు కొనుగోలు చేయడం కోసం నగరానికి వచ్చింది. సంజీవ్, మనోజ్ అనే ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.అది సేవించిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కారులో తిప్పుతూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.