కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి హర్ష వర్ధన్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళ శరీరం ఓ దేవాలయమంటూ వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపారు. మొన్నటికి మొన్న అత్యాచారం చాలా చిన్నదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. ఈ విషయం చల్లారిందని భావించేంతలోనే ఆయన తాజాగా మహిళ శరీరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలోని ఓ మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 'మహిళ శరీరం దేవాలయం లాంటిది. ఒక కొత్తతరాన్ని రూపొందించాలంటే ఆరోగ్యవంతులైన మహిళలు అవసరం. వాళ్లే అనారోగ్యం బారిన పడితే ఆ ప్రభావం కుటుంబం మీద, సమాజం మీద, జాతిమీద కూడా పడుతుంది' అంటూ ఆయన సెలవిచ్చారు.