నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నవారు అక్కడి విశ్వాసాలకు విలువ ఇస్తారు. అంతేకాదు మూర్ఖత్వంతో మొండితనంతో తాము కోరుకున్నట్లే జరగాలని అనుకోరు. కోర్టులు సైతం.. ఇలాంటి వారి విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది భావనల్ని సంతృప్తి పర్చటం కోసం.. ఎంతోమంది విశ్వాసాలకు భంగం వాటిల్లేలా కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది.