మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శనిసింగనాపూర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేని నేపథ్యంలో.. హెలికాప్టర్లలో దిగిమరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని కొన్ని మహిళా సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తామంతా వచ్చి శనిదేవుడికి పూజలు చేస్తామని మహిళా సంఘాలు హెచ్చరించడంతో ఆలయం వద్ద పోలీసు బలగాలను మోహరించారు.