యాహూ సంస్థ తన బెంగళూరు కార్యాలయంలో సమూల 'మార్పు'లకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు మెరుగైన సేవలందించడం కోసమే అని చెపుతున్నప్పటికీ ఉద్యోగులను ఊడబెరికే కార్యక్రమం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ చెపుతున్నప్పటికీ సంస్థలో కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేమన్నారు.