కోడిగుడ్లు -4(ఉడికించినవి), పండు మిరపకాయల పేస్ట్ - టీ స్పూన్, పచ్చిమిరపకాయల పేస్ట్- టీస్పూన్, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి -2, చింతపండు గుజ్జు - 2 టేబుల్స్పూన్లు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్, వంటసోడా - చిటికెడు, సోయా సాస్- టీస్పూన్, నూనె- తగినంత
తయారు చేసే విధానం:
బాణలిలో నూనె పోసి వేడయ్యాక గుడ్లు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టికోవాలి. విడిగా మరో పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి. దానితో పాటప సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించాలి.
ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండి.