తయారీ విధానం :
చికెన్ ముక్కల్ని ముందుగా శుభ్రం చేసుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని కారం, ఉప్పు, పసుపు పొడి వేసి బాగా కలిపి ఒక గంట పాటు పక్కనబెట్టేయాలి. తర్వాత బాణలిలో నూనె వేడయ్యాక పోపు గింజలు వేయాలి.
వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని చేర్చి.. మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ కూడా చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చింతపండు పేస్ట్ చేర్చి రెండు నిమిషాలుంచి స్టౌ ఆఫ్ చేసేస్తే చికెన్ ఊరగాయ రెడీ.. ఈ ఊరగాయ అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది.