తయారుచేయు విధానం:
మొదట ఓ గిన్నెలో మాంసం ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తీసుకుని బాగా కలపాలి. తర్వాత పది నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి.
ఇప్పుడు పాన్లో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక.. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో కెచప్, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి.
అప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది. దీనిని శీతాకాలంలో సాయంత్రం పూట చేసుకుని వేడి వేడిగా అలాగే ఆరగించవచ్చు. లేదా చపాతిలోకి సైడ్ డిష్గానో లేక రాత్రి భోజనం లోకి సైడ్ డిష్గానైనా ఆరగించవచ్చు.