తయారీ విధానం:
బోన్ లెస్ చికెన్ను ముక్కలుగా కట్ చేసి చికెన్ను శుభ్రం చేసుకోవాలి. పెరుగును బాగా గిలకొట్టి, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు, మినప్పిండి అన్నింటిని బౌల్లోకి తీసుకుని కాసింత నూనె పోసి కలుపుకోవాలి.
ఏలకులు, జాజిపత్రి, జాజికాయ పౌడర్ను కూడా చేర్చుకోవాలి. పెరుగుతో కలిపి వుంచిన మసాలాను చికెన్ పీస్లకు బాగా పట్టించి సుమారు నాలుగు గంటల పాటు ఊరనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలను గ్రిల్ స్టిక్స్తో గుచ్చుకుని ఓవెన్లో 10 నిమిషాల పాటు ఉడికించి, 3 నిమిషాలకు ఒకసారి చికెన్ ముక్కలను తీసి నూనె రాసి తిరిగి ఉడికించుకోవాలి.