ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కొత్తిమీర పొడి, పెరుగు చేర్చి బాగా కలుపుకుని కాసేపటి వరకు ఊరనివ్వాలి. తర్వాత స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక అందులో ఉల్లి తరుగును దోరగా వేయించుకోవాలి.
తర్వాత మసాలాతో ఊరనిచ్చిన చికెన్ను చేర్చి వేయించుకోవాలి. తర్వాత చికెన్ ఉడికేంత వరకు తగిన నీటిని చేర్చి చికెన్ 15 నిమిషాల పాటు బాగా ఉడికాక అందులో కరివేపాకు, కొత్తిమీర చేర్చి దింపేస్తే జీడిపప్పు చికెన్ గ్రేవీ రెడీ.