తయారీ విధానం :
ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కల్ని కలుపుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడయ్యాక చికెన్ ముక్కల్ని దోరగా ఇరువైపులా వేయించుకుని పక్కన బెట్టుకోవాలి. అదే నూనెలో బంగాళాదుంపలు, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉల్లి ముక్కలు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఇందులో మష్రూమ్, మిరియాల పొడి, చికెన్ స్టార్, వెనిగర్, గరం మసాలాను కలుపుకోవాలి. ఇందులోనే సోయా సాస్, టమోటా కెచప్, తర్వాత వేయించిన చికెన్ ముక్కల్ని చేర్చి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు చికెన్ ముక్కలకు సాస్, మసాలా పట్టేంతవరకు ఉంచి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రిసిపి రోటీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.