చుక్కకూర పైత్యం రోగాలను నయం చేస్తుంది. చుక్కకూర ఆకురసం చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపునొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాంటి చుక్కకూరతో టేస్టీ అండ్ హెల్దీ మటన్ కర్రీ ట్రై చేస్తే ఎలా వుంటుందో చూద్దామా?
ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి, కావాల్సిన సైజులో కోసుకోవాలి. యాలకులు, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్కలను కలిపి మెత్తగా నూరుకోవాలి. మటన్ను సన్నగా తరిగి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చిలను సన్నగా కోసుకోవాలి. అల్లం, వెల్లుల్లిలను మెత్తగా నూరి ఉంచాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.
అందులో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లను.. ఉప్పు, కారం, పసుపులను వేసి బాగా కలియబెట్టి నీళ్లుపోసి ఉడికించాలి. మాంసం బాగా మెత్తబడేలా ఉడికిన తరువాత పైన చుక్కకూరను చల్లి, బాగా కలిపి ఉడికిన తరువాత దించేయాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే చుక్కకూరతో మటన్ కర్రీ తయార్..!!