తయారీ విధానం :
బాణలిలో నూనెను వేడిచేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన రొయ్యలు, పసుపు వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, కొత్తిమీర వేసి కాసింత నీటితో దోరగా వేపాలి. చివర్లో టమోటా సాస్, వెల్లుల్లి రెబ్బలు వేసి పది నిమిషాల పాటు ఉంచి రొయ్యల బాగా ఫ్రై అయ్యాక దించేస్తే కొత్తిమీర రొయ్యల ఫ్రై రెడీ అయినట్లే. ఈ ఫ్రైని అన్నంలోకి సైడిష్గా నంజుకోవచ్చు.