ఉప్పు - తగినంత
తయారుచేయండి ఇలా: మొదట నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాలు వేయించిన తరువాత పులావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించాలి. తరువాత కోడిగుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారిన తరువాత అందులో బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు అలాగే వేయించాక నీటిని పోయాలి.
ఇప్పుడు తగినంత ఉప్పు, గరంమసాలా పొడి చల్లి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఒక పొంగు వచ్చాక మీడియం మంటమీద ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయి అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లి దించేయాలి. ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదేని కుర్మాతో కలిపి సర్వ్ చేయాలి.