ఆరోగ్యానికి మేలు చేసే కొరమీను కూరను ఎలా చేయాలి?

శుక్రవారం, 17 జూన్ 2016 (16:20 IST)
చేపల పులుసు తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలపులుసు అనగానే అందరికి నోరూరిపోతుంది. చికెన్ తరువాత నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడేది చేపలనే. కారంగా, పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ కొరమీను పులుసు పెట్టడం ఎలాగో ఇప్పుడు చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - 1 కిలో
ఉల్లిపాయలు - 2 కప్పులు తరిగినవి
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - కావలసినంత
కారం - రుచికి సరిపడా
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - తగినంత
పచ్చిమిరపకాయలు - 3
ధనియాల పొడి - 1/4 టీ స్పూను
గరం మసాలా - 1/4 టీ స్పూను
కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు
 
తయారీ విధానం : 
కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి. దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి. 
 
చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి. చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి