ప్రెజర్ కుక్కర్లో మటన్, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ఉప్పువేసి ఉడకబెట్టాలి. మూకుడులో నూనె వేడిచేసి మసాలా దినుసులన్నీ వేయాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
కరివేపాకు, గోంగూర, పసుపు వేసి, నూనె విడివడేదాకా ఉడకనివ్వాలి. మాంసం ముక్కలు కలిపి 5-10 నిమిషాలు ఉడికించి, నీరు పోసి, చిక్కబడే దాకా ఉడికించాలి. కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.