నూనె - వేయించడానికి సరిపడినంత
తయారు చేయండి ఇలా :
మొదట రొయ్యలను పొట్టు తీసి శుభ్రం చేసుకుని, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాలా పొడి, శనగ పిండితోపాటు రొయ్యల్ని కూడా వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో ముద్దని వడలా వత్తుకుని రెండు వైపులా బియ్యం పిండిలో ముంచి, నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం కూడా.