తయారీ విధానం:
బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. అందులో ఉల్లి తరుగు, మెంతుల్ని వేయించుకోవాలి. వేగాక టమోటాలు, పసుపుని చేర్చి వేపాలి. కారం, ఉప్పు కలుపుకుని శుభ్రం చేసుకున్న రొయ్యల్ని వేసి కలిపి పది నిమిషాలు వేపాలి. తర్వాత చింతపండు రసం చేర్చి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికిన కోడిగుడ్లు వేసి కలిపి పది నిమిషాల పాటు ఉడికించి గ్రేవీలా తయారయ్యాక దించేయాలి. అంతే రొయ్యలతో ఎగ్ గ్రేవీ రెడీ అయినట్లే. ఈ గ్రేవీ రోటీలకు, అన్నంలోకి టేస్టీగా ఉంటుంది.