మార్కెట్లో ఒకే ముల్లు ఉన్న చేపలను తీసుకోవాలి. వాటిని సమానంగా కట్ చేసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. వాటిపై తడి ఆరేంత వరకు ఉంచి, తర్వాత వాటికి ఉప్పు, నిమ్మరసం మిక్స్ చేసిన మిశ్రమాన్ని పట్టించి, ఒక పక్కన పెట్టుకోవాలి. మరో వైపు వెల్లుల్లి పేస్ట్ ను తయారుచేసుకుని వుంచుకోవాలి.
అదేవిధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర, ధనియాలను కలిపి మెత్తగా పేస్ట్ లా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ను చేపలకు అన్నివైపులా బాగా పట్టించి 10 లేదా 15 నిముషాల వరకు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌపైన ఫ్లాట్ గా వుండే పాన్ ను పెట్టి, అందులో కొంచెం నూనెను వేసి వేడిచేసుకోవాలి. అందులో కొంచెం అజ్వైన్, కరివేపాకును వేసి కొద్దిసేపు వరకు వేయించాలి. మరో వైపు చేపముక్కలను రవ్వలో బాగా అర్లించి అన్నివైపులా అంటుకొనేలా చేయాలి.