తయారీ విధానం :
ముందుగా వెల్లుల్లి తురుము, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ సౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్ళు పోసి జారుడుగా గట్టిగా కలుపుకుని శుభ్రం చేసుకున్న చేపముక్కలకు ఈ మసాలాను పట్టించాలి. ఈ మసాలా పట్టించిన చేప ముక్కలను అరగంట పాటు పక్కనబెట్టుకోవాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను వేసి దోరగా వేపుకుని ఇరువైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే బటర్ ఫిష్ ఫ్రై రెడీ.. ఇది వేడి వేడి రైస్తో సర్వ్ చేస్తే అందరూ లొట్టలేసుకుని తింటారు.