పసుపు పొడి: ఒక టేబుల్ స్పూన్
దాల్చినచెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, నూనె : తగినంత.
తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. పసుపు, కారం, ధనియాపౌడర్, గరం మసాలా, ఉప్పు, పంచదార కూడా జతచేసుకుని పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి మీడియం మంట మీద మరో 5 నిముషాలు వేగించాలి.
అరకప్పు నీళ్ళు పోసి రెండు నిముషాలు సిమ్లో ఉంచి ఉడికించాలి. గ్రేవీ బాగా ఉడికి, చిక్కబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లు అందులో వేసి, బాగా మిక్స్ చేయాలి. ఒక ఐదు నిముషాలు అలాగే సిమ్లో ఉంచి దించేయాలి. ఈ ఎగ్ కర్రీ వేడి వేడి రైస్తో పాటు రోటీలకు టేస్ట్గా ఉంటుంది.