కావలసిన పదార్థాలు : చేపలు : అర కిలో కారం : టేబుల్ స్పూన్ ధనియాల పొడి : టీ స్పూన్ జీలకర్ర పొడి : టీ స్పూన్ పసుపు : టీ స్పూన్ ఉప్పు : తగినంత
తయారు చేయు విధానం: నచ్చిన చేపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పైన తీసుకున్న మసాలా పొడులన్నిటినీ కలిపి సరిపడ ఉప్పు వేసి కలిపి తగినన్ని నీరు పోసి కలపి చేప ముక్కలపై పూసి అర గంట ఉంచాలి. బాణలిలో నూనె పోసి కాగాక చేప ముక్కల్ని వేసి ఎర్రగా వేయించి తీసి సర్వ్ చేయాలి.