శ్వేత సౌధంలో దీపావళి వేడుకల్ని ప్రారంభించిన ఒబామా

FILE
శ్వేతసౌధంలో మొట్టమొదటిసారిగా దీపావళి వేడుకలు ఆట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమెరికా అధ్యక్షుడు బారక్ హుస్సేన్ ఒబామా దీపావళి ప్రమిదను వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా భారతీయులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేసిన ఒబామా.. పండుగ కానుకగా, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరికీ "హెల్త్ పాలసీ"ని ప్రకటించారు. కాగా... మేరిలాండ్ శివవిష్ణు ఆలయ అర్చకులయిన నారాయణాచారి ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీపూజలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే... అమెరికా చరిత్రలో ఆ దేశ అధ్యక్షుడు హాజరై, దీపావళి వేడుకలను జరుపుకోవటం ఇదే మొట్టమొదటిసారి. అలాగే ఈ వేడుకలను అధికారికంగా గుర్తించటం, అధ్యక్ష భవనం అయిన వైట్‌హౌస్‌లో ఆట్టహాసంగా నిర్వహించటం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రపంచం మొత్తంమీదా మిలియన్ల సంఖ్యలో గల హిందువులు, సిక్కులు, జైనులు ఈ దీపావళి పర్వదినాన్ని అక్టోబర్ 17వ తేదీన వైభవంగా జరుపుకోనున్న సంగతి తెలిసిందే..!

వెబ్దునియా పై చదవండి