దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం

శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (13:53 IST)
దుబాయ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా అర్హులైన వారికి మరింత సాయం చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అలాగే మృతుల కుటుంబంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు, వ్యవసాయం కోసం కొంత భూమి, పెన్షన్లను పంపిణీ చేయనున్నామని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకరు మినహా మిగిలిన వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారేనని అధికార వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి