ధైర్యానికి మారుపేరు హనుమంతుడు. ఎలాంటి కష్ట సమయంలో అయినా ఆంజనేయుని తలచుకుంటే చాలు మనసు నిబ్బరంగా ఉంటుంది. ఆఖరికి దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలకు గురైనప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది.
ఆంజనేయుని స్మరిస్తే మనకు ఏ చింతలూ, సమస్యలూ ఉండవు. ధైర్యంగా, శాంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మరింత మంచిది. భోలాశంకరుడి అంశం అయిన ఆంజనేయుడు కూడా పిలిస్తే పలుకుతాడు. ఆపదల్లో ఆదుకుంటాడు. ఎల్లవేళలా తమకు రక్షణగా ఉండాలని, ధైర్యాన్ని సమకూర్చాలని భక్తులు ఆంజనేయుని ఆరాధిస్తారు.