అంతేగాకుండా తమిళనాడు రాష్ట్రం, శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులోని కాలభైరవ దేవాలయంలో పూజ చేయించినట్లైతే కాలసర్పదోషం తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆలయంలో భైరవమూర్తి శునకముతో గాకుండా యోగాసీనుడై భక్తులకు దర్శనమివ్వడం ద్వారా కాలసర్పదోషాన్ని తొలగిస్తాడని పురోహితులు చెబుతున్నారు.