మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి కుమారస్వామిని నిష్ఠతో పూజించాలి. తర్వాత పంచాక్షర మంత్రాన్ని 108 సార్లు ధ్యానించాలి. తర్వాత సూర్య నమస్కారం చేయాలి. తర్వాత చేతనైన విధంగా ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి.
అలాగే బియ్యం, నెయ్యి, మిరియాలు, జీలకర్రలతో అన్నం చేసి స్వామికి సమర్పించాలి. మంగళవారం సాయంత్రం శివాలయ దర్శనం చేసుకుని ఇంటికొచ్చి స్కంధపురాణం చదవాలి. ఆ రోజు రాత్రి నిద్రకు మంచంపై కాకుండా నేలమీదే నిద్రించాలి.
మహిళలకు తాంబూలం, గాజులు, కుంకుమ, దువ్వెన, అద్దం, గోరింటాకు, పసుపు వంటివి వాయనం ఇస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం పూట చేసే ఈ వ్రతం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం దక్కుతుంది. ఇంకా సంతానలేమి, వివాహంలో జాప్యం వంటి దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.