ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులను 'దేవీ నవరాత్రులు'గా పిలుచుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరించి, ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు.
శైలపుత్రికి కట్టుపొంగలి, బ్రహ్మచారిణికి పులిహోర, చంద్రఘంటకు కొబ్బరి కలిపిన అన్నం, కూష్మాండకు అల్లంతో చేయబడిన గారెలు, స్కందమాతకు దధ్యోదనం, కాత్యాయనికి కేసరీబాత్, కాళరాత్రికి వివిధరకాల కూరముక్కలతో కలిపి వండిన అన్నం, మహాగౌరీకి చక్రపొంగలి, సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరమైనవని పండితులు చెబుతున్నారు.