పాదరసం వినాయకుడిని పూజిస్తే.. ఆర్థిక లోటు ఉండదట!

గురువారం, 10 జులై 2014 (18:54 IST)
పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకుని పూజించేవారి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పురోహితులు అంటున్నారు. సాధారణంగా పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహా శక్తివంతమైంది. పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందంటే.. 
 
* పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
 
* పాదరస గణపతిని పూజించడం ద్వారా అకాల మృత్యుభయం ఉండదు.
 
* పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.
 
*  పారద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలూ, చిరాకులూ తలెత్తవు.
 
*  ''ఓం లంబోదరాయ నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు.

వెబ్దునియా పై చదవండి